మాల్దాలో రూ.10లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం
మాల్దా: నకిలీ కరెన్సీని తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని పశ్చిమబెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలోని మాల్దా జిల్లాలో సద్దాం హుస్సేన్ అనే వ్యకి దగ్గర నుంచి రూ.10 లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని బీఎస్ఎఫ్ దళానికి చెందిన ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. బమ్చర గ్రామానికి చెందిన హుస్సేన్ బ్యాగ్ లో కరెన్సీని తీసుకెళ్తుండగా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.