మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్ల మృతి

దంతేవాడ: చత్తీస్‌గడ్లోని జిల్లా అక్షానగర్‌ చెక్‌పోస్టుపై మావోయిస్టులు జరిపిన దాడిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి చెందారు. చెక్‌పోస్టుపై దాడి చేసిన తర్వాత మావోయిస్టులు ఆయుధాలు అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి.