మావోయిస్టుల ల్యాండ్‌మైన్ లభ్యం

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ బాంబు లభ్యమైంది. మావోయిస్టులు భూమిలో పాతిపెట్టిన ల్యాండ్‌మైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా రెండు కిలోల ల్యాండ్ మైన్ దొరికింది. పోలీసులు దీనిని స్వాధీనం చేసుకుని బాంబు స్కాడ్ ద్వారా నిర్వీర్యం చేశారు.