మావోయిస్టు అగ్రనేత సుదర్శన్‌ అరెస్టు

ఖమ్మం, మార్చి 23 (జనంసాక్షి) :
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ కీలకనేత సుదర్శన్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం వైరాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఈయన నిందితుడిగా ఉన్నారు. అలాగే కేంద్ర మాజీ హోమంత్రి మాధవరెడ్డి హత్య కేసులో  కీలక నిందితుడు. ఒడిశాలోని మల్కన్‌గిరి కలెక్టర్‌ వినీల్‌ కృష్ణ కిడ్నాప్‌ ఉదంతంలో కూడా ఇతని పాత్ర ఉంది. సుదర్శన్‌పై ప్రభుత్వం రూ. 20లక్షల రివార్డు ప్రకటించింది.