మిల్ట్రీ క్యాంటీన్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 17 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సి.ఐ ఆఫీస్ ఎదురుగా నూతన మిల్ట్రీ క్యాంటీన్ షాప్ ను బుధవారము గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ ప్రారంభించారు.షాప్ యజమాని ఎమ్మెల్యే కి , చైర్మన్ కి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా సత్కరించారు.మిల్ట్రీ క్యాంటీన్ లో ఎమ్మెల్యే వస్తువులను కోనుగోలు చేసారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, కౌన్సిలర్స్ మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, శ్రీను తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు