మీర్జాపూర్ క్యాంపులో కొండచిలువ కలకలం.

కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంప్లో మంగళవారం పొడవైన కొండ చిలువ కలకలం సృష్టించింది. క్యాంప్ లోని ఉమా మహేశ్వర్ రావ్ ఇంటి ఆవరణంలో కొండచిలువ ప్రవేశించడంతో ఇంట్లో వారందరు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పక్కింటి వ్యక్తి అయిన కొల్లూరు రవీంద్ర ఎంతో సాహసించి ఆ కొండ చిలువను కర్రలతో హతమర్చారు.