*మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో భాగంగా పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్*

నాచారం(జనంసాక్షి) : మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలోని కృష్ణా నగర్ కాలనీలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లని పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ…60 యేండ్ల సమైక్య పాలనలో మన పండుగలకు ఎటువంటి గౌరవం కల్పించలేదు అన్నారు. రాష్ట్రం సిద్దించాక సీఎం కెసిఆర్ మన పండుగలకు గౌరవం కల్పిస్తున్నారు అన్నారు.అట్లాగే బతుకమ్మ పండుగకు తెలంగాణ ఇంటి ఆడ బిడ్డలకు బతుకమ్మ చీరలను అందచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సుఖేందర్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్,  బాలయ్య, పల్లా శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య గౌడ్, రాజు, కృష్ణా రెడ్డి, కొయ్యడ జయపాల్, మహేష్, శేఖర్ గౌడ్, దండెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.