మీ వెంటే ఉంటా అచ్చంపేట అసెంబ్లీ బిజెపి నాయకుడు శ్రీకాంత్ భీమా

జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 17 నవంబర్
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రంలో వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారిని అచ్చంపేట నియోజకవర్గ బిజెపి నాయకుడు శ్రీకాంత్ భీమా పరామర్శించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల పిలుపుమేరకు వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారికి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మీ వెంటే నేనుంటా అని భరోసా ఇవ్వడం జరిగింది.
పరామర్శించిన వారిలో పాతుకుల తిరుమలయ్య, రక్త బాల గౌడ్, రక్త రామస్వామి గౌడ్, చింతకాల్ల మల్లేష్, మెంట బాలరాజు, ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ,వావిలాల రమేష్, జిల్లా కార్యదర్శి శ్రీను నాయక్, మండల ప్రధాన కార్యదర్శులు మహేష్ ,బ్రహ్మచారి, మండల ఉపాధ్యక్షులు ఎల్లయ్య, కార్యకర్తలు, బాలు ,రవితేజ, శేఖర్ ,శీను, పరమేష్, జైపాల్, కురుమయ్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు.