ముంబయిలోని సేయింట్ జార్జ్ చర్చ్ పై రాళ్లతో దాడి
మహారాష్ట్ర నవీ ముంబయిలోని సేయింట్ జార్జ్ చర్చ్ పై గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేసారు. మూడు మోటార్ సైకిళ్ల పై మాస్కులు ధరంచిన దుండుగలు ఈ దాడి చేసారని పోలీసులు తెలిపారు. చర్చిలోని ఓ విగ్రహాన్ని గురిచూసి కావలనే దుండగులు రాళ్లు రువ్వారని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనలోగాజుతో చేసిన దేవుని విగ్రహం దెబ్బతిన్నదని ఏసీపీ సూర్య వంన్షీ వెళ్లడించారు. ఈ క్రైం సీనంతా సీసీటీవీలో రికార్డయిందని… అయితే దృష్యాలు మాత్రం క్లియర్గా లేదని సూర్య వంన్షీ తెలిపారు. ఈ దాడీని బాంబే ఆర్చిడియోసీ తీవ్రంగా ఖండించింది. ఖండేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు