ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరం

తెరాస యూత్ నియోజకవర్గ అధ్యక్షులు శివగారి
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 13 : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని తెరాస యూత్ నియోజకవర్గ అధ్యక్షులు శివగారి అంజయ్య అన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 27వేల రూపాయల చెక్కును శనివారం చేర్యాల పట్టణానికి చెందిన లబ్దిదారురాలు శనిగారి ప్రియాంక కు వారు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరు పేదలకు వరంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుందన్నారు. ఎవరైనా అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందితే ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకుంటే వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస యూత్ పట్టణ ప్రధాన కార్యదర్శి పచ్చిమడ్ల సాయి కిరణ్ గౌడ్ పాల్గొన్నారు.