*ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ*

పెబ్బేరు జూన్ 29  ( జనంసాక్షి ):  అనారోగ్యంతో బాధపడుతున్న పెబ్బేరు పట్టణానికి చెందిన సైదా బేగం, కొత్త సూగూరు  జి.చెన్నమ్మ  లకు శాస్త్ర చికిత్స నిమిత్తం ఖర్చులకు ఇబ్బందులు ఎదురవ్వడాని వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  తీసుకెళ్లగా  సైదా బేగం రూ. 25000, చిన్నమ్మ కు 16000/ రూపాయల సీఎం సహాయనిధి చెక్కుల ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు  అందించడం జరిగింది.  సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిందని పేదల క్షేమమే ప్రభుత్వ ద్యేయమని అన్నారు. కార్యక్రమంలో హరిశంకర్ నాయుడు,సుగూర్ సర్పంచ్ వెంకటేష్,మున్సిపల్ కో అప్షన్ ముస్తాక్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.