ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన

టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్

ఆత్మకూరు(ఎం) ఆగస్టు 26 (జనంసాక్షి) ఆత్మకూరు మండల పరిధిలోని సింగారం గ్రామానికి చెందిన జామ హేమలత భర్త నవీన్ గారికి ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి సహకారంతో వచ్చిన 60000 వేల రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ గారు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి భరోసానిచ్చింది అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ పల్లెర్ల సత్యనారాయణ గ్రామ శాఖ అధ్యక్షులు పన్నాల వెంకటరెడ్డి బత్తుల లక్ష్మీనారాయణ బొల్లెపల్లి శ్రీహరి కొప్పుల శ్రీనివాస్ రెడ్డి కొలను అంజిరెడ్డి మల్లారెడ్డి పంజాల మల్లేష్ గౌడ్ మందుల ఇసాక్ తదితరులు పాల్గొన్నారు