ముగిసిన ఉన్నతి పై శిక్షణ శిబిరం

 

జహీరాబాద్ ఆగస్టు 26 (జనంసాక్షి) డి.డి.ఎస్ కె.వి.కె ఆధ్వర్యంలో డి.ఆర్.డి.ఎ, సంగారెడ్డి వారి ఆర్థిక సహాయంతో ఐదు రోజులు గా ఉన్నతి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చివరి రోజు శుక్రవారం పి. డి శ్రీనివాసరావు, డి.పి.ఎమ్ కొమురయ్య, ఎ.పి.డి రాజు,జైదేవ్,రాంబాబు ఎ.పి.ఎమ్. శివకుమార్ పాల్గొని సేంద్రియ వ్యవసాయం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పి. డి మాట్లాడుతు శిక్షణార్థులు తమ వ్యవసాయ మరియు ఇంటి ఆదాయాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమంలో భాగంగా వారు నేర్చుకున్న కొత్త సాంకేతికతలను అవలంబించాలని ఆయన సూచించారు.కె.వి.కె హెడ్ సురేష్ దగడె, వారం రోజులు పాటు జరిగిన శిక్షణ కార్యక్రమం గురించి వివరించి వానపాముల ఎరువు తయారి విధానం, ఉపయోగలు మరియు ఇతర సేంద్రీయ ఎరువుల గురించి వివరించడం జరిగింది, డి.పి.ఎమ్ కొమురయ్య ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ కింద ఉన్న సబ్సిడీలు మరియు ఇతర ఉపాధిలో అవగాహన కల్పించడం జరిగింది, ఎ.పి.డి.జయదేవ్, రాజు మాట్లాడుతూ యువకులు, యువతులు, రైతులు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ పొందిన వారందరికీ సర్టిఫికెట్లు అందించారు.ఈ కార్యక్రమంలో కె.వి.కె ఎస్.ఎమ్.ఎస్ లు ఏపిఓ లు 45 మంది రైతులు, యువతి, యువకులు పాల్గొన్నారు.