ముగిసిన కేరళ స్పీకర్ అంత్యక్రియలు

కేన్సర్ తో చనిపోయిన కేరళ అసెంబ్లీ స్పీకర్ కార్తికేయన్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆయన భౌతికకాయానికి పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటూ… అన్ని పార్టీల ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. ఆయన్ను కడసారి చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.