ముగ్గురు అమర్‌నాథ్‌ యాత్రికుల మృతి

వీరిలో ఒకరు రాష్ట్రానికి చెందిన వ్యక్తి
శ్రీనగర్‌ : అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకొంది. అనారోగ్యానికి గురైన ముగ్గురు భక్తులు మార్గమధ్యంలోనే కన్నుమూశారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన వేసా మొహ్లి (65), గుజరాత్‌కు చెందిన పాండి భరత్‌ కుమార్‌, పంజాబ్‌ వాసి సోరత్‌ కుమార్‌ ఉన్నారు. యాత్రికుల మృతిపై జమ్మూకాశ్మీర్‌ గవర్నర్‌, శ్రీ అమర్‌నాథ్‌ ఆలయ మండలి చైర్మన్‌ కూడా అయిన ఎస్‌.ఎస్‌. వోవ్రో విచారం వ్యక్తం చేశారు. యాత్ర ప్రారంభమైన గత 13 రోజుల్లో ఇప్పటి వరకు 51 మంది యాత్రికులు మృతి చెందారు.సోమవారం ఉదయం 5 గం.లకు మరో యాత్రికుల బృందం అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరింది. భగవతి నగర్‌లోని యాత్రి నివాస్‌ బేస్‌ క్యాంపు నుంచి ప్రారంభమైన ఈ బృందంలో 4.025 మంది ఉన్నారు.