*ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రధానం*

 ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 20 :
మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య సంఘం కార్యాలయం నందు స్వాతంత్ర్య వజ్రోత్సవాలు పురస్కరించుకొని శనివారం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలలో మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాలకి చెందిన 10 మంది మహిళలు పాల్గొని, వివిధ రకాల రంగువల్లతో ముగ్గులను వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ జి. స్నేహ హాజరై ముగ్గులను పరివేక్షించి విజేతలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మొదటి బహుమతి ఎర్రవల్లి గ్రామానికి చెందిన లక్ష్మి, రెండవ బహుమతి బీచుపల్లి గ్రామానికి చెందిన ఐకేపీ కార్యకర్త సరస్వతి, మూడవ బహుమతి శివనంపల్లి గ్రామానికి చెందిన సుజాత లకు ఎంపీపీ స్నేహ, స్థానిక ఎంపిటిసి వెంకటేశ్వరమ్మ చేతుల మీదగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపిఎమ్ శోభారాణి, సీనియర్ అసిస్టెంట్ శోభ, ఐకెపి సిబ్బంది మహిళలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో వారితో పాటు… స్థానిక ఎంపీటీసీ వెంకటేశ్వరమ్మ గారు సీనియర్ అసిస్టెంట్ శోభ గారు APM శోభారాణి గారు మరియు ఐకేపీ సిబ్బంది మరియు మహిళలు పాల్గొన్నారు