మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో గ్రంధాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ్, టిఆర్ఎస్ నేత శేషంపల్లి నరసింహులు

మల్దకల్ అక్టోబర్ 22(జనంసాక్షి)కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తేనే మునుగోడు అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని జోగులమ్మ గద్వాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ ,టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు శేషంపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. శనివారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం ఆయా గ్రామాలలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇల్లులు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఉప ఎన్నిక తెచ్చాడని మండిపడ్డారు. గత మూడు సంవత్సరాలుగా మునుగోడును పట్టించుకోని రాజగోపాల్ రెడ్డి రాబోయే సంవత్సర కాలంలో ఎలా అభివృద్ధి చేస్తాడని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అలాంటి వ్యక్తికి మనం మునుగోడు ఉప ఎన్నికను గెలిపించి కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాను అక్రమంగా సంపాదించిన డబ్బులను పంచి మునుగోడు లో రాజగోపాల్ రెడ్డి మళ్ళీ  గెలవాలనుకుంటున్నాడని అలాంటి వ్యక్తిని గెలిపిస్తే అతనే అభివృద్ధి చెందుతాడని మునుగోడు వెనుకబడుతుందని పేర్కొన్నారు.ఈ ప్రచారంలో టిఆర్ఎస్ నాయకులు మైల గడ్డ చంద్రశేఖర్, జములమ్మ ఆలయ చైర్మన్ సతీష్, కురవపల్లి సర్పంచ్ వాసు, తదితరులు పాల్గొన్నారు.