మూడో విడత ప్రజాసంఘ్రమయాత్ర ముగింపు సభను విజయవంతం చేయండి

బిజెపి యాచారం మండల ప్రధాన కార్యదర్శి నడికుడి కృష్ణ
రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం,(జనం సాక్షి):- మూడో విడత ప్రజా సంగ్రామ ముగింపు సభను విజయవంతం చేయాలని యాచారం మండల బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నడికుడి కృష్ణ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిధులు నియామకాలు స్వయంపాననే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికు కూడా న్యాయం జరగడం లేదని నియంత పాలనకు చరమగీతం పాడాలని ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మూడు విడతలుగా పాదయాత్ర కొనసాగిస్తున్నారని చెప్పారు. 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర హన్మకొండ లో 27 తేదీన ముగుస్తున్నందున ముగింపు భారీ బహిరంగ సభకు జేపీ నడ్డా వస్తున్నారు కావున బూత్ స్థాయి నుండి  బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని నియంత పాలనకు చరమగీతం పాడాలని అన్నారు.