మృతుడి అలీ కుటుంబాన్ని పరామర్శ.

పరామర్శించిన ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్.పరామర్శించిన ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్.
జనం సాక్షి ఉట్నూర్.
ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామానికి చెందిన షేక్ అలీ 80 శాతం దివ్యాంగుడైన అనారోగ్యానికి గురై మనస్థాపం చెంది గత నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.విషయం తెలుసుకున్న ఇంద్రవెల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్ లక్కారంలోని స్వగృహానికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ అలీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు.ఈ క్రమంలో ఏఎంసి సెక్రటరీ ఎం రాజేశ్వర్ సిబ్బంది రాజేందర్ మాధవ్ దేవన్న సామాజిక కార్యకర్త అంజాత్ ఖాన్ దాసాండ్ల దేవన్న షేక్ నబి షేక్ అహ్మద్ ఓసామా తదితరులు ఉన్నారు.