మృతుని కుటుంబానికి టిఆర్ఎస్ అండగా ఉంటుంది..

– వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి.
ఊరుకొండ, సెప్టెంబర్ 22 (జనంసాక్షి):
మృతి చెందిన కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం
ఊర్కొండ మండలంలోని మాదారం గ్రామానికి చెందిన అంకూరి బాలయ్య(65) అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థానిక తెరాస నాయకులు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, అనుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆర్థిక సహాయంగా ఖర్చుల కోసం రూ.5,000/- మరియు ఊరుకొండ వైస్ ఎంపీపీ సత్తి అరుణ్ కుమార్ రెడ్డి రూ.5,000/- మొత్తం పదివేల రూపాయలను శాంతయ్య కు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి, వార్డ్ మెంబర్లు ధ్యాప ఆల్వాల్ రెడ్డి, మేకల రాములు, తెరాస మండల అధ్యక్షులు వీరారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు వేముల రాములు, గోపాల శ్రీశైలం, చిక్కొండ్ర మల్లేష్, అంకూరి పకీర, అంకూరి కృష్ణ, పోలె శ్రీకాంత్, గుడిగానిపల్లి బాలకృష్ణ, రాచాలపల్లి బంటు, తదితరులు పాల్గొన్నారు.