మృతురాలి కుటుంబానికి అండగా ఉంటాం…

సర్పంచ్ విజయమ్మపాండురంగారెడ్డి.
జనం సాక్షి- ఊరుకొండ
అనారోగ్యంతో మృతి చెందిన బాధితురాలి కుటుంబ సభ్యులకు అండగా నిలబడతామని స్థానిక సర్పంచ్ గంగాపురం విజయమ్మ పాండురంగారెడ్డి అన్నారు. బుధవారం ఊర్కోండ మండలం రాచాలపల్లి గ్రామానికి చెందిన మాడ్గుల మైసమ్మ(80) అనారోగ్యంతో మృతిచెందింది.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు డా॥సి. లక్ష్మారెడ్డి గారు మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభుతి తెలియజేస్తూ రూ.5000/- మరియు గ్రామ సర్పంచ్ శ్రీమతి G.విజయమ్మ పాండురంగా రెడ్డి మృతురాలి కుటుంబసభ్యులను ఓదార్చి తమవంతు సహౕయంగా రూ.5000/- మరియు స్థానిక MPTC సభ్యులు శ్రీమతి లావణ్య అమరేశ్వర్ రెడ్డి తమప్రగాఢ సానుభుతి తెలియజేస్తూ రూ.2000/- మొత్తం…రూ.12,000/-రూపాయలు ఆర్థిక సహాయం మృతురాలి కుమారుడు మాడ్గుల నాగయ్య కు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరుశ రాములు, PACS డైరెక్టర్ వెంకటయ్య, వార్డు సభ్యులు శాంతయ్య, ఉస్సేన్ తదితరులు పాల్గొన్నారు.