మెదక్‌ చర్చిలో ఘనంగా ఈస్టర్‌ వేడుకలు

మెదక్‌: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ చర్చిలో ఈస్టర్‌ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున సూర్యోదయ ఆరాధనతో వేడులు ప్రారంభించారు. మత గురువులు శిలువును చర్చిలో ప్రతిష్ఠించారు. ఈ ఆరాధనలో మెదక్‌ డయాసిన్‌ పరిధిలోని ఐదు జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సీఎన్‌ఐ డిప్యూటీ మోడిరేటర్‌, మెదక్‌ డయాసిన్‌ ఇంఛార్జీ బిషన్‌ దైవ ఆశ్వీర్వాదం భక్తులను ఉద్ధేశించిన ప్రసంగించారు.