మెనూ పాటించని వార్డెన్ సస్పెన్షన్
భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్26(జనం సాక్షి): నియమాలకు అనుగుణంగా విద్యార్థులకు ఆహారం అందించని హాస్టల్ వార్డెన్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్టీ బాలుర వసతి గృహాన్ని ఐటీడీఏ పీవో గౌతమ్ మంగలవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, వారికి అందించే ఆహారంపై పీవో పరిశీలన చేశారు. కాగా మెనూ సక్రమంగా అమలు చేయట్లేదని పేర్కొంటూ పీవో గౌతమ్ వార్డెన్ను సస్పెండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థుల పట్ల అమర్యాదగా మాట్లాడుతున్నారని వంట మనిషి రత్నంను విధుల నుంచి తొలగించారు.