మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అందించాలి

మల్దకల్ జూన్ 30 (జనంసాక్షి) మండల కేంద్రంలోని ఎం ఆర్ సి భవనంలో గురువారం  ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఈఓ కొండారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను క్రింది తరగతుల నుండి పై తరగతుల పంపే విధానం పై ఆన్లైన్ లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది.మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారంగా వడ్డించాలని వారానికి మూడుసార్లు గుడ్లు ఖచ్చితంగా పెట్టాలని, సమయపాలన పాటించాలని మండల విద్యాధికారి కొండారెడ్డి ఆదేశించారు.ప్రతి నెల 3వ తేదీనఎస్ఎంసి మీటింగ్ పెట్టాలని విద్యార్థులు సంబంధించిన యూనిఫామ్ బట్టలను ఎస్ఎంసి తీర్మానం తీసుకొని టైలర్ ఇచ్చి సాద్యమైనంత వరకు విద్యార్థులకు రెండు జతలు బట్టలు ఇప్పించాలని ఆదేశించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఇమ్మానియల్ ,ఎంఐఎస్  వెంకటేష్, సి సి ఓ విజయకుమార్, సీఆర్పీలు పద్మావతమ్మ ,పరమన్న పాల్గొనడం జరిగింది.