మొక్కలు నాటి సంరక్షించుకోవాలి: ఎంపీపీ గంగాధరి సంధ్య,జెడ్పిటిసి రణం జ్యోతి.

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటి పై జాతీయ జెండా రెపరెపలాడాలని దౌల్తాబాద్ ఎంపిపి గంగాదరి సంద్య, జెడ్పీటీసీ రణం జ్యోతి లు పేర్కొన్నారు. బుదవారం ఎంపిడివో కార్యాలయం ఎదుట మోక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గర్వించేలా వత్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. గడిచిన 75 సంవత్సరాల్లో మనదేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.15 రోజులపాటు వజోత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోవా లని పిలుపునిచ్చారు.
 ఈ కార్యక్రమంలోగ్రామ సర్పంచ్ ఆది వెంకన్న, ఎంపిటీసీ ఆది వనిత వేణుగోపాల్,పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీమోద్దీన్, వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, ఎంపిడివో రాజేశ్ కుమార్,ఎంపీవో గఫూర్ ఖాద్రి, ఎమ్మార్వో బాల్ రాజు, పంచాయతీ రాజ్ ఏయి శరత్
రైతు బంధు అధ్యక్షులు స్టీవాన్ రెడ్డి, కోపరేట్ చైర్మన్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.