మొబైల్ షాపును ప్రారంభించిన మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్

మల్దకల్ ఆగస్టు 25 (జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ లో స్నేహ మొబైల్ షాప్ నుగురువారం గద్వాల వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ రామేశ్వరమ్మ కురుమన్న ప్రారంభించారు. పాస్టర్ రవికుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ నిర్వాహకులు లక్ష్మణ్, లాలన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు.షాపు యజమానులు చైర్ పర్సన్ దంపతులతో పాటు పాల్వాయి సర్పంచ్ శివరామ్ రెడ్డిలను శాలువా పూలమాలలతో సత్కరించారు.ముందుగా శ్రీ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మార్కెట్ చైర్ పర్సన్ రామేశ్వరమ్మ కురుమన్న దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్వాయి ఉప సర్పంచ్ రంజిత్,తెరాస పార్టీ నాయకులు ఏసు రత్నం,ఆంజనేయులు,జీవరత్నం, ప్రభాకర్,ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.