మొబైల్ షాప్ లో బ్లూటూత్ చోరీ

పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు
 నర్సాపూర్. సెప్టెంబర్, 20,  ( జనం సాక్షి  )
 ఓ గుర్తు తెలియని వ్యక్తి మొబైల్ షాప్ లో బ్లూటూత్ చోరీకి పాల్పడిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో మంగళవారం నాడు చోటు చేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
 నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న భవాని మొబైల్ షాప్ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బ్లూటూత్ కావాలని అడిగాడు బ్లూటూత్ ఇచ్చిన తర్వాత  పరిశీలించాడు.  ఆసమయంలో  షాపు యజమానిని  మాటల్లో పెట్టి అక్కడినుంచి  బ్లూటూత్తో ప్రారరయ్యాడు. ఇది   గమనించిన   స్థానికులు ఆ వ్యక్తిని వెంబడించి పట్టుకున్నారు.  అనంతరం పోలీసులకు అప్పగించారు.
 ఫోటో రైట్ అప్ ఎన్ ఎస్ పి  4  బ్లూటూత్ చోరీ చేసిన వ్యక్తి ని పట్టుకున్న స్థానికులు