మోదీ.. చేతలమనిషిగా నిరూపించుకున్నారు!

chinహైదరాబాద్‌: తాను మాటల మనిషి కాదు.. చేతల మనిషి అని ప్రధాని నరేంద్ర మోదీ నిరూపించుకున్నారని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణలో ఆదివారం మోదీ పర్యటనను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం వెనుక కేంద్రం సహకారం ఉందన్నారు. తొలి పర్యటనలోనే తెలంగాణలో ప్రధాని మోదీ రూ.17వేల కోట్లు పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరిస్తోందన్నారు. భాజపా అంటేనే అభివృద్ధి అనే నినాదం దేశవ్యాప్తంగా మార్మోగుతోందన్నారు.