మోదీ సమక్షంలో జాతీయ జెండాకు అవమానం

3
కౌలాలంపూర్‌,నవంబర్‌21(జనంసాక్షి):ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలోనే భారత జాతీయ జెండాకు అవమానం జరిగింది. మలేషియాలో జరుగుతున్న ఆసియన్‌ సదస్సుకు ప్రధాని మోదీ హాజరైన విషయం తెలిసిందే. ఆ సదస్సులో భాగంగా జపాన్‌ ప్రధాని షింజో అబేతో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానులు చర్చలు జరుపుతున్న ప్రదేశంలో ఏర్పాటు చేసిన భారత జాతీయ జెండాను తల కిందులుగా ఉంచారు. సాక్షాత్తూ.. ప్రధాని మోదీ సమక్షంలోనే భారత జాతీయ జెండాకు అవమానం జరగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దురదృష్టవశాత్తూ ఏర్పాట్ల హడావిడిలో అనుకోకుండా ఇలా జరిగిందని ఈ ఘటనపై ఓ అధికారి వివరణ ఇచ్చాడు.