యడ్యూరప్పకు సీబీఐ కోర్టులో ఊరట

yeddyurappaకర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. మైనింగ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కుంటున్న ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది సీబీఐ కోర్టు. 40 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణలతో ఆయనపై గత కొంత కాలంగా విచారణ జరుపుతున్నారు. యడ్యూరప్పతో పాటూ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అందరు నిందితులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ స్పెషల్ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది.