యుటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం యూటీఎఫ్ నూతన కమిటీ  అధ్యక్షులుగా యం.నర్సింహ్మ (ఎస్.ఎ. జడ్పిహెచ్.ఎస్ పోల్కంపల్లి), ప్రధాన కార్యదర్శిగా ఇ. జంగయ్య ఎస్.ఎ. జడ్పిహెచ్.ఎస్ రంగాపూర్)  గౌరవ అధ్యక్షులుగా కె.లింగమయ్య  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కల్వకుర్తి డివిజన్ పరిధిలోని వంగూరు, కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, చారకొండ మండల మహాసభలు యూటీఎఫ్ భవన్ కల్వకుర్తిలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి యం.శ్రీధర్ శర్మ, రాష్ట్ర నాయకులు ఎ. చిన్నయ్య, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పూర్వ అధ్యక్షులు కామ్రేడ్ ఏపీ.మల్లయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, సిపిఎస్ ను వెంటనే రద్దుచేసి, ఓపిఎస్ ను ప్రవేశ పెట్టాలని  ,ప్రమోషన్ లు,  బదిలీలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఎ.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు, రామేశ్వరయ్య, బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.