*యువత క్రీడల్లో రాణించాలి.

*కట్కూరి పద్మ నరేందర్.
చిట్యాల 24(జనం సాక్షి) యువత క్రీడల్లో రాణించాలని చిట్యాల ఎంపీటీసీ కట్కూరి పద్మ నరేందర్ అన్నారు .శనివారం మండల కేంద్రం కు చెందిన రాంనగర్ వాలీబాల్ టీమ్ కు క్రీడా వస్తువులు అందించారు..అనంతరం పద్మ నరేందర్ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి గ్రామానికి పేరు తీసుకురావాలని, మరియు క్రీడా ల ద్వారా అనేక ఉద్యోగాలు సాధించడానికి కృషి చేయాలని,గ్రామీణ క్రీడా కారులకు తాము ఎప్పుడు అండగా ఉంటూ ప్రోత్సహిస్తామని తెలియజేశారు అనంతరం గతంలో రాష్ట్రస్థాయిలో ఆడిన క్రీడాకారులను అభినందించారు.