యూనియన్ ఉపాధ్యక్షునికి, ఈసి మెంబర్ కు ఘన సన్మానం..

శంకరా పట్నం:
తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు జక్కోజు రమేష్, ఈసీ మెంబర్ గాజుల స్వామిని, శనివారం మండల విశ్వకర్మ, విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షుడు కన్నాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ తాటికొండ సదానంద చారి మాట్లాడారు. శంకరపట్నం మండల ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం నాయకుడు, తాడికల్ గ్రామ నివాసి, జర్నలిస్టుల యూనియన్ జిల్లా ఉపాధ్యక్షునిగా, జక్కోజు రమేష్, ఆప్త మిత్రుడు, సోదర సమానులు, శంకరపట్నం ప్రెస్ క్లబ్ కోశాధికారి, ధర్మారం గ్రామ నివాసి గాజుల స్వామిని తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సఘం కరీంనగర్ జిల్లా శాఖలో ఎన్నికైనందుకు ,విశ్వబ్రాహ్మణ ,విశ్వకర్మల సంఘం ఆధ్వర్యంలో శాల్వాలతో సన్మానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మల సంఘం మండల నాయకులు, ప్రసాద్, రవి, రాజు, రమేష్, ఈశ్వర చారి, కృష్ణ, మధుకర్, దేవరాజు, సురేష్, శ్రీనివాస్, లింగమూర్తి, వివిధ గ్రామాల విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు.