యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచితంగా తాగినీరు పంపిణీ

మల్దకల్ డిసెంబర్ 7 జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో మూడు రోజులపాటు ఉచితంగా మూడు ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో ఉచితంగా తాగునీటిని అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ కొట్టం గంగాధరం, క్యాషియర్ పరశురాం,ఫీల్డ్ ఆఫీసర్ సల్మా, ఆలయ చైర్మన్ ప్రహ్లాద రావు,ఈవో సత్య చంద్రారెడ్డి,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి,సర్పంచ్ యాకోబు,చంద్రశేఖర్ రెడ్డి,జనార్దన్ రెడ్డి,దామ రామకృష్ణ, చంద్రశేఖర రావు,విశ్రాంతి బ్యాంకు ఉద్యోగి మనసాని నాగరాజు,బ్యాంకు సిబ్బంది ఆశన్న ,వెంకటమ్మ, రఘ,ఎస్తేరి,వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.