యూపిలో ఘోర రోడ్డు ప్రమాదం

డివైడర్‌ను ఢీకొన్న ప్రైవేట్‌ బస్సు

17మంది మృతి

లక్నో,జూన్‌13(జ‌నం సాక్షి): ఉత్తర ప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంసంభవించింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి డివైడర్‌ ను ఢీకొట్టడంతో 17 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 35 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన యుపిలోని మెయిన్‌పురి సవిూపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సవిూపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే వేగం కంట్రోల్‌ చేయలేక డివైడర్‌ను ఢీకొట్టారని ప్రయాణికులు అంటున్నారు.