యూపీఏకు వ్యతిరేకంగా అవిశ్వాసం: తృణమూల్‌

ఢిల్లీ: యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ తీర్మానానికి సహకరించాలని యూపీఏ భాగస్వామ్య పక్షాలు, వామపక్షాలను ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కోరారు.