ఘనంగా ఆదివాసీ ప్రపంచ దినోత్సవ వేడుకలు…

బేల, ఆగస్టు 9 ( జనం సాక్షి) : మండల కేంద్రము లోని కోమ్ రాం బీమ్ చౌక్ లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోమ్ రాం బీమ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆదివాసీ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసులు ఐక్యంగా ఉంటూ , హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు ఆడే శంకర్, మండల రాయి సెంటర్ అధ్యక్షుడు కొరంగే సోనేరావు, ప్రధాన కార్యదర్శి జంగశావ్,కొడపా బీమ్ రావ్, ఎంపిటిసి అరుణ్  తదితరులు పాల్గొన్నారు..