రక్షణ స్టాండింగ్ కమిటీలో సంతోష్కు చోటు
న్యూఢిల్లీ,జూన్7(జనం సాక్షి): పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం ప్రకటించారు. ఈ కమిటీల్లో ముగ్గురు టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులకు స్థానం దక్కింది. రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపి జోగినిపల్లి సంతోష్కుమార్, కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బండ ప్రకాశ్, ఆహార, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బడుగుల లింగయ్యయాదవ్లను నియమించారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుల లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ (ఎంపి ల్యాడ్స్) కమిటీలో ఎంపి జోగినపల్లికి చోటు దక్కిన విషయం విదితమే.