రన్నింగ్,లాంగ్ జంప్ ట్రాక్ ఏర్పాటు చేయాలి

బోథ్ (జనంసాక్షి) నవంబర్ 09
కానిస్టేబుల్ మరియు ఆర్మీ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న బోథ్ యువకుల కోసం స్థానికంగా ఉన్న బోథ్ జూనియర్ కళాశాలలోని గ్రౌండ్లో రన్నింగ్ ట్రాక్ మరియు లాంగ్ జంప్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎఐఎస్ఎఫ్ ఆద్వర్యంలోబుధవారం బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సుమేర్ పాషా మాట్లాడుతూ కానిస్టేబుల్ మరియు ఆర్మీ అభ్యర్థులు ఫిజికల్ టెస్టుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తే వారు భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించి బోథ్ పేరును నిలబెట్టడం జరుగుతుందన్నారు. వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు షేక్ షాకీర్, అభ్యర్థులు వికాస్,వెంకటేష్ నరేష్,అవినాష్ తదితరులు పాల్గొన్నారు.