రహదారుల మరమ్మతు చేపట్టాలని అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

జనంసాక్షి, మంథని : మంథని నియోజకవర్గం లో దెబ్బతిన్న రహదారులను మరమ్మత్తులు చేయాలని కోరుతూ మంథనిలో సోమవారం జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ కు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఐలి ప్రసాద్ వినతి పత్రం అందజేశారు. మంథని-కాటారం, మంథని-ఖమ్మం పెళ్లి రహదారులపై ఓవర్ లోడ్ తో లారీలు నడవడం వల్ల రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఈ రహదారుల లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు రహదారుల మరమ్మతులు చేపించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. వర్షాకాలం కావడంతో రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో నీరు నిలవడంతో ద్విచక్ర వాహనాలు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నాయని వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రహదారుల మరమ్మతులు వెంటనే చేపించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఆయన వెంట కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ రావికంటి సతీష్, ముత్తారం మండల పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, అజీమ్ ఖాన్, నాగుల రాజయ్య తదితరులు ఉన్నారు.