,రాజస్థాన్ రాష్ట్రంలో దళిత విద్యార్థిని దారుణంగా హింసించిన ఉపాధ్యాయుడు

24రోజులపాటు మృత్యువుతో పోరాడి ఆగస్టు 14న మరణించిన విద్యార్థి

ఈ దారుణాన్ని ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బంద్
మానవపాడు, ఆగస్టు 23(జనంసాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా, మనవపాడు మండలంzphs మరియు అమరవాయి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఎమ్మార్పీఎస్ నాయకులు బంద్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ మంచినీళ్ల కుండలో నీళ్లు తాగినందుకు ఇంద్రనీల్ అనే దళిత విద్యార్థిని అక్కడి అగ్రవర్ణాలకు చెందిన ఉపాధ్యాయుడు
దారుణంగా కొట్టడంతో ఇరవై నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి ఆగస్టు 14న మృతి చెందడం జరిగింది.ఇట్టి దారుణ విషయాన్ని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఈరోజు విద్యాసంస్థలు బంద్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు జయరాజు, జల్లాపురం శ్రీనివాసులు, పురుషోత్తం ,క్రాంతి, ఈశ్వర్ ,రఘు ,గిద్దన్న తదితరులు పాల్గొన్నారు