రాజాపూర్ గ్రామంలో యువత మృతి.

కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో వివాహిత మృతి చెందిన సంఘటన చేసుకుంది.గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామంలోని బున్యాధి పురం సుధాకర్ రెడ్డి భార్య పుణ్యాధి పురం మాధవి వయసు (35) సంవత్సరాలు సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు .బన్ని (7) కార్తీక్ రెడ్డి.(9) రాజాపురం గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు కోడేరు ఎస్ ఐ ఓబుల్ రెడ్డి, పెద్ద కొత్తపల్లి ఎస్ఐ  రాములు, సి ఐ యాదాద్రి,సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన మాధవిని భర్త సుధాకర్ రెడ్డి గ్రామస్తులు వారితో పాటు వారి బంధువులు ఇంటి ముందు ధర్నా చేశారు. పోలీసులు వారికి నచ్చచెప్పగా వారి వినకుండా సుధాకర్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపాలని అతన్ని కఠినంగా శిక్షించాలని అంతవరకూ శవాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ల నివ్వమని ఇలాంటి సంఘటస మరో గ్రామంలో జరగకూడదని మరో మహిళకు జరగకూడదని బిస్మించి కూర్చున్నారు.