రాజ్నాథ్ విదేశీ పర్యటన వాయిదా
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యా, అమెరికా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఆయన రష్యాలో పర్యటించాల్సి ఉంది. అయితే కాశ్మీర్ లో ఉగ్రదాడి జరగడంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
కాశ్మీర్ లోని యురి సెక్టార్ లోని సైనిక కార్యాలయంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనపై రాజ్ నాథ్ సింగ్ ఆరా తీశారు. సైనిక ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఘటనపై జమ్మూకాశ్మీర్ గవర్నర్, సీఎంతో ఆయన మాట్లాడారు. కాశ్మీర్లో భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజ్నాథ్ సూచించారు.