రాబోయే రోజుల్లో మెరుగైన విద్యను అందించుటకు మా వంతుగా కృషి-ఎన్ హెచ్ పిఎస్ చైర్మన్ గోంగళ్ళ రంజిత్ కుమార్

రాబోయే రోజుల్లో మెరుగైన విద్యను అందించుటకు మా వంతుగా కృషి-ఎన్ హెచ్ పిఎస్ చైర్మన్ గోంగళ్ళ రంజిత్ కుమార్

మల్దకల్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి)మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ సహకారంతో స్ట్రీట్ కాజ్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో నిర్మించిన నూతన తరగతి గదిని గొంగళ్ళ రంజిత్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మెరుగైన సమాజం కోసం విద్య ఆయుధమని విద్యను పాలకులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని,పల్లెనిద్రలో భాగంగా ఇక్కడ బస చేసినప్పుడు తరగతి గదుల కొరతతో విద్యార్థులు చెట్లకు కింద కూర్చొని పాఠాలు వినడాన్ని గమనించి,హైదరాబాదులోని స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఇక్కడ తరగతి గదిని నిర్మించామని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో నడిగడ్డలో చదువు యొక్క ప్రాముఖ్యతను గుర్తించివిద్యా సదుపాయాలు పెంపొందించేలా ఒకవైపు పోరాటం చేస్తూనే మరోవైపు ప్రజల సహకారంతో స్వచ్ఛంద సంస్థల సహకారంతో, పెంపొందించుటకు ప్రయత్నిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల జిహెచ్ఎం మహేష్,కన్వీనర్ బుచ్చిబాబు,స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు శ్రీ వర్ధన్ రెడ్డి,పవన్,సుజల్,హేమంత్, సాహితీ,శ్లోకలతో పాటు నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు లవన్న,విష్ణు, ప్రేమరాజ్ ,లక్ష్మన్న,అంజి,పరుష,దస్తగిరి గౌడ్,రాముడు,గోపాల్,హనుమేష్,గోపాల్,భూపతి,రమేష్ ,వెంకట్ రాములు,అంజి,గోపాల్,దొడ్డన్న,తిరుమలేశ్,అంజి,తదితరులు పాల్గొన్నారు.