రాష్ట్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత వివరాలు
విశాఖ: రాష్ట్రంలో శుక్రవారం వివిధ ప్రాంతాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాలను విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెంటచింతల, నిజామాబాద్, అనంతపురం, కడప, కర్నూలు -41 డిగ్రీలు నమోదు కాగా, మహబూబ్నగర్, హన్మకొండలో 40, ఆదిలాబాద్, హైదరాబాద్, రామగుండంలో 39, నెల్లూరు, హకీంపేట, తిరుపతిలో 38, కావలి, నందిగామ, తుని, విజయవాడ, విశాఖపట్నం, భద్రాచలం, నల్గొండ, ఆరోగ్యవరంలో 37 డిగ్రీ సెల్సియన్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.