రాష్ట్రపతి జీతం మూడింతలు పెరగబోతున్నది!

imagesరాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వేతనాలు మూడింతలు పెరగనున్నాయి. దేశంలోని ఈ రెండు అత్యున్నత పదవుల వేతనాల పెంపునకు హోంశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. రాష్ట్రపతి వేతనం రూ.5 లక్షలు, ఉపరాష్ట్రపతి వేతనం రూ.3.5 లక్షలు కాబోతున్నది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటు ముందుకు ఈ బిల్లు రానుంది.