రాష్ట్రస్థాయి కోకో పోటీలకు టిఎంఆర్ఎస్ కోటగిరి విద్యార్థి ఎంపిక.

కోటగిరి డిసెంబర్ 8 జనం సాక్షి:-మండలంలొని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలకు చెందిన ముజంబిల్ అనే విద్యార్థి హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి అండర్ 18 కోకో పోటీలకు ఎంపికయ్యారు.జిల్లా స్థాయి పోటీలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన ముజంబిల్ రాష్ట్ర స్థాయి కోకో పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ బషిరుద్దీన్ తెలిపారు.అదేవిధంగా పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థి శానవజ్
టీఎంఆర్ఎస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో పాల్గొనడం అలాగే నిజాంబాద్ జిల్లా స్థాయి 400 మీటర్స్ పరుగు పందెంలో నితిన్ మొదటి బహుమతి సాధించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయు లు,సిబ్బంది,తోటి విద్యార్థులు వారిని అభినందించా రు.