రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో పూర్తిగా విఫలం
విజయవాడ: విద్యుత్, గ్యాస్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అంధకారంలో చిక్కుకుందని ఆ పార్టీ కార్యదర్శి నారాయణ విజయవాడలో ధ్వజమెత్తారు. కేజీ బేసిన్ నుంచి గ్యాస్ను తరిలించుకుపోయి. రాష్టానికి తీవ్ర అన్యాయం చేస్తున్నా కిరణ్ ప్రభుత్వం అసమర్థతతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ వ్యక్తం చేశారు. లేదంటే తామే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రధాని వద్దకు వెళ్తామని అన్నారు.