రూ . 1,1,348 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

ప్రవేశపెట్టిన ఆర్ధీక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
బడ్జెట్‌ అంచనాలు
– ప్రణాళికావ్యయం రూ. 59,422 కోట్లు
– ప్రణాళికేతర వ్యయం రూ. 1,01,92 కోట్లు
-ద్రవ్యలోటు రూ. 24,487కోట్లు
-రెవెన్యూ మిగులు రూ, 1023 కోట్లు
– 12వ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్ర వృద్ది రేటు 10 శాతం ఉండేల లక్ష్యం

విద్యకు కేటాయింపులు
-ఉన్నత విద్యకు రూ, 482 కోట్లు
పాఠశాల విద్యకు 1,990 కోట్లు
విద్యార్థుల మెస్‌ చార్జీల పెంపునకు 250 కోట్లు
7వ తరగతి వరకు మెస్‌ చార్జీలు 475 నుంచి 750 వరకు పెంపు
8నుంచి 10వ తరగతి  వరకు మెస్‌ చార్జీలు 535 నుంచి 850కు పెంపు
ఇంటర్‌ ,డిగ్రీ , పీజీ వరకు మెస్‌ ఛార్జీలు 520 నుంచి 1050కు పెంపు
ఎస్సీ , బీసి విద్యార్థులకు రాజీవ్‌ దీవెనపథకం ద్వారా ఉపకారవేతనాలు అందజేయనున్నారు.దీనివల్ల సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు లబ్ది పొరదనున్నారని ఆర్ధీక మంత్రి అంచనా.
నెల్లూరులో మరో వైద్య కళాశాల ఏర్పాటుకు పరిపాలన పరమైన అనుమతి లభించింది. దీనికోసం బడ్జెట్‌లో రూ. 352 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
సంక్షేమం
గిరిజన సంక్షేమ  శాఖ రూ. 2126 కోట్లు
వెనకబడిన తరగతుల సంక్షేమానికి రూ. 4027 కోట్లు
మహిళా శిశు సంక్షేమం కు 2712 కోట్లు
సాంఘీక సంక్షేమ శాఖకు 1027 కోట్లు
మైనార్టీ సంక్షేమ శాఖకు 1027 కోట్లు
ఎస్సీ కులాల ఉప ప్రణాళికకు 8585 కోట్లు
ఎస్టీ ల ఉప ప్రణాళీకకు 3,666కోట్లు
వికలాంగుల సంక్షేమానికి 73 కోట్లు

శాంతి భద్రతలు
శాంతి భద్రతలకు 5,386 కోట్లు
పోలీస శిక్షణా సంస్థల ఆధునీకరణకు 100 కోట్లు
హైదరాబాద్‌ లో నిఘా కెమెరా వ్యవస్థ ఏర్పాటు

సేవలు
మౌళిక సదుపాయాల కల్పనకు 180 కోట్లు
పరిశ్రమలు వాణిజ్యశాఖ కు 1120 కోట్లు
వైద్య ఆరోగ్య శాఖకు 6481 కోట్లు
రహదార్లు , రవాణాశాఖకు 7117 కోట్లు
పౌరసరాఫరాల శాఖ కు 3231 కోట్లు
యువజన సేవలకు 280 కోట్లు
పట్టణాభివృద్ది శాఖకు 6,770 కోట్లు
అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ఉపాధిహామి పథకం కింద 2,700 కోట్లు
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు 200 కోట్లు
రాష్ట్ర రాజధాని నగరంలో మెట్రో రైలు నిర్మాణం కోసం భూసేకరణ పునరావాసానికి అదనంగా 1980కోట్లు

సాంస్కృతిక ం , పర్యాటకం
తెలుగు భాట పేరిల సాంస్కృతిక పండగల కోసం 25 కోట్లు
సాంస్కృతిక రంగానికి 69 కోట్లు
పర్యాటక శాఖ 163 కోట్లు

విద్యుత్‌ శాఖ
రానున్న ఏడాది కాలంలో 2200 మెగావాట్ల అదనపు విద్యుత్‌ ఉత్పాదనకు చర్యలు
చిత్తూరు జిల్లాలో తాగునీటి సరఫరా కోసం ఇన్‌క్యావ్‌ ద్వారా ఏర్పాట్లు
వ్యవసాయానికి ఏడుగంటల నాణ్యమైనా విద్యుత్‌  సరాఫరా
ఈ ఏడాది జనవరి వరకు కొత్తగా 94304 విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాం
వ్యవసాయ విద్యుత్‌ రాయితి కోసం ప్రభుత్వం3261 కోట్లు కేటాయించింది.
జైకా సహకారంతో 16 జిల్లాల్లో 2.43 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు నాణ్యమైనా విద్యుత్‌ కోసం 1154 కోట్లు

ఐటీ ఉద్యోగాలు
ఐటీ శాఖకు 207 కోట్లు
తిరుపతి , జహీరాబాద్‌లలో హ టళ్ల నిర్వహణకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు
ఆర్ధీక శాఖలో ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ వ్యవస్థలో భాగంగా బిల్‌ మానిటరింగ్‌ ఏర్పాటు
18 కొత్త రెవెన్యూ డివిజన్లు 52 అర్బన్‌ మండలాలు ఏర్పాటు చేస్తాం .
హైదరాబాద్‌ కు తాగునీటి వసతి పెంపు నకు 6770 కోట్లు (గోదావరి , కృష్ణ పథకాలు)
వచ్చే ఏడాది కాలంలో 27 ,903 ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆర్ధీక మంత్రి ఆనంరామనారాయణరెడ్డి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కోన్నారు.
వైద్య వసతుల కల్పనకు 6481 కోట్లు
జలయజ్ఞం , నీటి పారుదల
జలయజ్ఞానికి. రాష్ట్ర బడ్జెట్‌లో 13800కోట్లు
నీటి పారుదల శాఖకు 22,895 కోట్లు
పోలవరం ప్రాజెక్టు అంచనా 16,010 కోట్లు
ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా 38500కోట్లు
పైరెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జలయజ్ఞంలో 221,435 లక్షల ఎకరాలకు సాగునీరు
ఇప్పటి వరకు జలయజ్ఞంలో 7208 కోట్లు వ్యయం చేశారు.
వ్యవసాయ విద్యుత్‌ రాయితి కోసం ప్రభుత్వం 3621 కోట్లు కేటాయించింది.
జైకా సహకారంతో 16 జిల్లాల్లో 2.43 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్‌ కోసం 1154 కోట్లు కేటాయించారు.
83 వేల టన్నుల ఆహార ధాన్యాల నిల్వకు 42 కోట్లతో 39 మండల స్ధాయి గోదాముల నిర్మాణం
వర్షాధారిత వ్యవసాయ అభివృద్దికి 2903 కోట్లు కేటాయించారు.
వ్యవసాయ బడ్జెట్‌
రాష్ట్ర బడ్జెట్‌ లో 25,962 కోట్లతో వ్యవసాయబడ్జెట్‌ను ఆర్ధీక మంత్రి ప్రవేశ పెట్టారు.
వ్యవసాయ బడ్జెట్‌ ప్రణాళిక వ్యయం 17,694 కోట్లు
వ్యవసాయ బడ్జెట్‌ ప్రణాళికేతర వ్యయం 8,267 కోట్లు
ఈ ఏడాది 72450 కోట్ల వ్యవసాయ రుణాలు లక్ష్యం
వ్యవసాయ అనుభంద రంగాలకు 6128 కోట్లు
ప్రకృతి వైపరిత్యాలకు వ్యవసాయ బడ్జెట్‌లో 589 కోట్లు
పుడ్‌ ప్రాసెసింగ్‌ 100కోట్లు
కనీస మద్దతు ధర లభించని సమయంలో రైతులను ఆదుకునేందుకు 100 కోట్లతో ఆలంభన నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ధీకమంత్రి ఆనం ప్రకటించారు.
ఆహార ఉత్పత్తుల ప్రోసెసింగ్‌ ప్రత్యేక యూనిట్‌
వడ్డీలేని పంట రుణాలకు ప్రభుత్వం 500 కోట్లు కేటాయించింది.
విత్తనాబివృద్ది కి 308 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు 450 కోట్లు
సోలార్‌ పంప్‌ సెట్లకు 150 కోట్లు
రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి 2013-14 బడ్జెట్‌ దోహదం చేస్తుందని రాష్ట్ర ఆర్ధీకశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల మానవాభివృద్దికి కృషి చేస్తామని , ఇది ప్రజాప్రభుత్వమని అన్నారు.