రెచ్చిపోయిన తాలిబన్లు
కాబూల్,జూన్19(జనం సాక్షి ): అనుమానిత తాలిబన్లు అప్ఘన్ భద్రతాదళాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో నలుగురు అప్ఘనిస్తాన్ భద్రతా దళ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కుండుజ్ ప్రావిన్స్లోని ఆర్మీ, పోలీస్ సరిహద్దు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల్లో మరో ఆరుగురు అధికారులు గాయపడ్డారని కుండుజ్ ప్రావిన్స్ అధికార ప్రతినిధి నెమతుల్లా టెమోరీ వెల్లడించారు.భద్రతా దళాలు ప్రతిఘటించి ఏడుగురు చొరబాటు దారులను హతమార్చాయని తెలిపారు. కుండుజ్ ప్రావిన్స్లో తరచుగా జరిగే కాల్పుల్లో తాలిబన్లు కీలకంగా ఉండటంతో..ఈ దాడులు జరిపింది కూడా వారేనని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.